- కలెక్టర్లుగా పలువురు నియామకం
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో పెద్దయెత్తున ఐఎఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సిఎస్ నీరబ్కుమార్ ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాకుళం కలెక్టరుగా స్వప్నిల్ దినకర్, పార్వతీపురం మన్యం-శ్యామ్ప్రసాద్, విశాఖ పట్నం-హరీంద్రప్రసాద్, అనకాపల్లి-కె విజయ, అంబేద్కర్ కోనసీమ- రావిలాల మహేష్కుమార్, పల్నాడు- అరుణ్బాబు, నెల్లూరు- ఆనంద్, తిరుపతి-ఎస్ వెంకటేశ్వర్, అన్నమయ్య- చామకూరి శ్రీధర్, కడప-శివశంకర్ లతోటి, శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరుగా చేతన్ను నియమించారు. ఇప్పటి వరకు ఆయా జిల్లాల్లో పనిచేస్తున్న వారిని బదిలీ చేసిన ప్రభుత్వం వేరొక ప్రాంతంలో ప్రస్తుతం పోస్టింగు ఇవ్వలేదు.
డిప్యుటేషన్పై వచ్చిన అధికారులు రిలీవ్
ఎన్నికల విధుల్లో భాగంగా డిప్యుటేషన్పై వచ్చిన 27 మంది అధికారులను ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్కుమార్ మీనా రిలీవ్ చేశారు. ఆయా అధికారులను వారి మాతృశాఖలకు పంపిస్తూ ఆదేశాలు జారీ చేశారు.