దళిత శోషణ్ ముక్తి మంచ్ జాతీయ నాయకులు వి శ్రీనివాసరావు
ప్రజాశక్తి-విజయవాడ : రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా విజయవాడలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి స్మృతివనంలో దళిత శోషణ్ ముక్తి మంచ్ (డి.ఎస్.ఎం.ఎం ) జాతీయ నాయకులు వి శ్రీనివాసరావు బృందం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనలో, ఆయన రచించిన రాజ్యాంగ పరిరక్షణలో అందరూ కలిసి సాగాలని పిలుపునిచ్చారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు చేటు తెస్తున్న శక్తులను తరిమికొట్టాలని అన్నారు. ఆయనతో పాటు కెవిపిఎస్, విద్యార్ధి, యువజన, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.