హైదరాబాద్: ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో మాచర్ల వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు అయినట్లు సమాచారం. ఏపీ పోలీసులు, తెలంగాణ స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు ముమ్మరంగా గాలించి సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీపంలోని ఓ కంపెనీ గెస్ట్హౌస్లో అదుపులోకి తెలుస్తోంది. ఎన్నికల వేళ పోలింగ్ బూత్లో ఈవీఎం ధ్వంసం చేసిన ఇష్యూలో ఎమ్మెల్యే పిన్నెల్లిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరారీలో ఉన్న ఎమ్మెల్యే కోసం పోలీసులు ఉదయం నుండి విస్తృతంగా గాలిస్తున్నారు. విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఎమ్మెల్యేపై లుకౌట్ నోటీసులు సైతం జారీ చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యే పిన్నెల్లి తలదాచుకున్నట్లు సమాచారం రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. తాజాగా అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే అరెస్ట్పై పోలీసులు ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.