ప్రజాశక్తి-పెదబయలు: మండలంలో నాటు తుపాకులు ఎవరి దగ్గరైనా ఉంటే స్వచ్ఛందంగా అప్పగించాలని ఎస్ఐ పి,మనోజ్ కుమార్ పత్రికా ప్రకటనలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ మేరకు గలగండ పంచాయతీ కుతంగిపుట్టు గ్రామస్తులు పాంగి లవకుశ, కిల్లో గోపాల్, కొర్ర బిస్నాద్లు స్వచ్ఛందంగా తమ దగ్గర ఉన్న మూడు నాటు తుపాకీలను పెద్దబయలు పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, గ్రామాలలో ఎవరి దగ్గరైనా నాటు తుపాకులు ఉన్నట్లయితే స్వచ్ఛందంగా పోలీస్ స్టేషన్కి వచ్చి అందజేయాలని కోరారు.
![మాట్లాడుతున్న ఎస్ఐ](https://prajasakti.com/wp-content/uploads/2024/03/ga-a-n.jpg)