ప్రజాశక్తి – మైలవరం : ప్రజలు తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని శనివారం స్థానిక తారకరామా నగర్లో మైలవరం ఎసిపి మురళీమోహన్ ఆధ్వర్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎసిపి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని సూచించారు. ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే సమాచారం అందించాలని ఈ కార్యక్రమంలో సిఐ కిషోర్ బాబు, ఎస్సై హరిప్రసాద్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.