వృద్ధుడికి నమస్కరిస్తున్న గుమ్మనూరు జయరామ్
ప్రజాశక్తి-గుత్తి
టిడిపి అధినేత చంద్రబాబుతోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమని ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరామ్ తెలిపారు. ఆదివారం పట్టణంలోని 2, 3, 12, 13వ వార్డుల్లో సోదరుడు నారాయణతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసిపి నుంచి పలువురు టిడిపిలో చేరారు. వారికి గుమ్మనూరు జయరామ్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జయరామ్ మాట్లాడుతూ గుత్తిలో తీవ్ర తాగునీటి సమస్య ఉందని, తాము అధికారంలోకి వస్తే తాగునీటి సమస్యను శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. జగన్ పాలనలో ఎపి 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. మళ్లీ చంద్రబాబు సీఎం కావడం ద్వారా రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాలను మహిళలకు వివరించారు. చంద్రబాబు సీఎం కావడం వల్ల ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు తల్లికి వందనం పేరుతో ప్రతి ఏడాది రూ. 15వేలు, అలాగే ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా, ఎంపీగా అంబిక లక్ష్మీనారాయణను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం మండలంలోని రజాపురం, శ్రీపురం తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో టిడిపి నాయకులు డాక్టర్ హిమబిందు, ఎంకె.చౌదరి, ఎన్.కేశవనాయుడు, టిడిపి మండల కన్వీనర్ బర్దివలి, మాజీ ఎంపిపి వీరేష్, నాయకులు పి.నారాయణస్వామి, పి.రవితేజ, దిలా శీనా, పిల్లెల్లి కృష్ణయ్య, పి.సుధాకర్, పి.ప్రభాకర్, బోయ వేణు, ఎస్ఎం.బాషా, జక్కలచెరువు గోవిందు, ప్రతాప్, జి.సుంకన్న, నగదాని సత్య, జనసేన నాయకులు పాటిల్ సురేష్, చిన్న వెంకటేశులు, బిజెపి నాయకులు పాల్గొన్నారు.