పాత బస్టాండ్ (ఏలూరు జిల్లా) : ఆర్టిసి బస్సు వ్యక్తిని ఢీకొట్టడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన శుక్రవారం ఏలూరు పాత బస్టాండ్, కర్ల వంతెన వద్ద జరిగింది. జంగారెడ్డిగూడెంకు వెళ్లే ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో సంఘటన స్థలంలో వ్యక్తి మృతి చెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేశారు.