ప్రజాశక్తి- పంగులూరు (బాపట్ల) : అంతర్జాతీయ ఖో ఖో దినోత్సవం సందర్భంగా … మండల కేంద్రమైన పంగులూరులో ఆదివారం ఉదయం ఖో ఖో క్రీడాకారులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక మాగుంట సుబ్బరామిరెడ్డి, బాచిన నారాయణమ్మ జూనియర్ కళాశాల నుండి ప్రారంభమైన ర్యాలీ పంగులూరు బస్టాండ్ సెంటర్ వరకు సాగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఖో ఖో అసోసియేషన్ కార్యదర్శి మేకల సీతారామిరెడ్డి మాట్లాడుతూ … ఖో ఖో క్రీడకు పంగులూరు ఎంతో ప్రాధాన్యతనిస్తుందని, ఇక్కడ నుండి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ, స్థాయిలలో అనేకమంది క్రీడాకారులు తయారయ్యారని అన్నారు. స్థానిక గ్రామస్తులు పెద్దల సహకారంతో గత 30 సంవత్సరాలుగా ఇక్కడ ఖో ఖో క్రీడా దినదినాభివఅద్ధి చెందిందని చెప్పారు. ఎస్ ఆర్ ఆర్ ఖో ఖో అకాడమీ ఏర్పాటు చేసి క్రీడాకారులను తయారు చేస్తున్నామని, పంగులూరు గ్రామం ఖో ఖో క్రీడకు చిరునామాగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో అనేకమంది ఖో ఖో క్రీడాకారులు పాల్గొన్నారు.