విజయవాడ : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ … నేటి నుండి అంగన్వాడీలు సమ్మె బాటపట్టారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో అంగన్వాడీ సంఘాలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో నేటి నుండి అంగన్వాడీలు రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు.
గుంటూరు : అంగన్వాడీలకు కనీస వేతనం అమలు చేయాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం.. గ్రాట్యూటీ ఇవ్వాలని, ఎఫ్ఆర్ఎస్ యాప్ ను రద్దు చేయాలని, తదితర డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా .. గుంటూరు నగరంలోని అంగన్వాడీలు కలెక్టరేట్ ఎదుట మంగళవారం సమ్మె శిబిరం ఏర్పాటుచేసి ఆందోళన ప్రారంభించారు.