అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలోనే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 16 నుంచి వైసీపీ ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు. ఈ నెల 14 లేదా 15 లోపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. బీజేపీ ,జనసేన, టీడీపీ, ఎన్ని పార్టీలు కలిసి వచ్చిన వైసీపీకి నష్టం లేదన్నారు.
అసలు టీడీపీకి ఒక రాజకీయ సిద్ధాంతం లేదని ఆయన విమర్శలు గుప్పించారు.ఈ దేశంలో ఒక వైసీపీతో తప్ప చంద్రబాబు ప్రతి పార్టీతోనూ పొత్తు పెట్టుకున్నాడని అన్నారు. అధికార దాహం తప్ప రాష్ట్ర అభివఅద్ధి చంద్రబాబుకు పట్టదన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి 51 శాతం ఓట్లు వచ్చాయని.. టీడీపీ, జనసేన, బీజేపీ మొత్తం కట్టకట్టుకుని వచ్చినా 46 శాతానికి మించలేదు, మించవన్నారు. మళ్లీ మరోసారి ఏపీ ప్రజలు వైసీపీకి పట్టం కడతారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.