గూర్గావ్ : వచ్చే జులై 10న విడుదల చేయనున్న తదుపరి తరం గెలాక్సీ జడ్ స్మార్ట్ఫోన్లకు ముందస్తు బుకింగ్ను తెరిచినట్లు సామ్సంగ్ ఇండియా ప్రకటించింది. పారిస్లో కొత్త ఫోన్ల గ్లోబల్ ఆవిష్కరణ ఉంటుందని పేర్కొంది. ఈ స్మార్ట్ఫోన్లను రూ.2,000 మొత్తంతో ముందస్తుగా రిజర్వ్ చేసుకోవడం ద్వారా రూ.7000 వరకు విలువైన రాయితీలను పొందవచ్చని తెలిపింది.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/07/samsung.jpg)