Samsung గెలాక్సీ ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్లకు ముందస్తు బుకింగ్‌

Jul 1,2024 21:22 #Business, #mobile phones, #samsung

గూర్‌గావ్‌ : వచ్చే జులై 10న విడుదల చేయనున్న తదుపరి తరం గెలాక్సీ జడ్‌ స్మార్ట్‌ఫోన్లకు ముందస్తు బుకింగ్‌ను తెరిచినట్లు సామ్‌సంగ్‌ ఇండియా ప్రకటించింది. పారిస్‌లో కొత్త ఫోన్ల గ్లోబల్‌ ఆవిష్కరణ ఉంటుందని పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్లను రూ.2,000 మొత్తంతో ముందస్తుగా రిజర్వ్‌ చేసుకోవడం ద్వారా రూ.7000 వరకు విలువైన రాయితీలను పొందవచ్చని తెలిపింది.

➡️