ప్రజాశక్తి – బిజినెస్ బ్యూరో : ప్రముఖ బిల్డింగ్ మెటీరియల్స్ తయారీ సంస్థ అపర్ణ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఎఇఎల్) తన కార్యకలాపాలను నెల్లూరుకు విస్తరించినట్లు ప్రకటించింది. ఇక్కడ తమ, ఇంటీరియర్ డిజైన్లకు టైల్స్ ప్రపంచంలోని సరికొత్త పోకడలు, ఆవిష్కరణలను అన్వేషించడానికి అనుకూలమైన కేంద్రంగా సేవలను అందించనున్నట్లు తెలిపింది. దేశ వ్యాప్తంగా తమకు 700 విటెరో సెలెక్ట్ షోరూంల నెట్వర్క్ ఉన్నటు ఎఇఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అపర్ణ రెడ్డి తెలిపారు. ఈ కొత్త షోరూం ప్రారంభం, అసాధారణమైన నాణ్యత, వినూత్న ఉత్పత్తులను వినియోగదారులకు అందించనుందన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/04/aparana.jpg)