- బ్రాండ్ అంబాసీడర్గా సత్యదేవ్
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో భారీ విస్తరణపై దృష్టి సారించినట్లు శ్రీచక్ర మిల్క్ ప్రొడక్ట్స్ ప్రకటించింది. 2014లో పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రారంభమైన తమ వ్యాపారం.. వేగంగా రెండు రాష్ట్రాల్లో కార్యకలాపాలను విస్తరించిందని పేర్కొంది. 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన వార్షికోత్సవ వేడుకల్లో సంస్థ నూతన లోగోను ఎపి మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆవిష్కరించారు. బ్రాండ్ అంబాసీడర్గా నటుడు సత్యదేవ్ నటించిన ప్రచారాన్ని టాలీవుడ్ నటుడు విజయ దేవరకొండ విడుదల చేశారు. ఈ సందర్బంగా శ్రీ చక్ర మిల్క్ ఎండి రామంజనేయులు మాట్లాడుతూ.. ప్రస్తుతం 18 పాల శీతలీకరణ కేంద్రాలు, టెట్రా ప్యాక్కింగ్ మిషినరీలను నిర్వహిస్తున్నామన్నారు. గత పదేళ్లలో రూ.200 కోట్లకు పైగా వార్షిక టర్నోవర్ సాధించామన్నారు.