ఇవిఎంలు భద్రపరిచిన కేంద్రంలో పరిశీలన

సిబ్బందితో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎల్‌.శివ శంకర్‌

పల్నాడు జిల్లా: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా నరసరావుపేటలోని ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా ఉన్న మార్కెట్‌ యార్డ్‌ గోదాములో భద్రపరిచిన ఈవిఎం మిషన్లను పలు రాజకీయ పార్టీ ప్రతి నిధులతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా  కలెక్టర్‌  ఎల్‌. శివశంకర్‌ శుక్రవారం తనిఖీ చేశారు. భద్రతాపరిస్థితులను సిబ్బందిని అడిగి తెలుసు కున్నారు. ఎన్నికల విధుల్లో అలసత్వం ప్రదర్శించ వద్దని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం, రెవెన్యూ డివిజనల్‌ అధికారి సరోజ, ఈవిఎం మిషన్ల నోడల్‌ అధికారి అజరు కుమార్‌, కలెక్టరేట్‌ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ను ఆకస్మిక తనిఖీ చేశారు.

➡️