ప్రజాశక్తి-రైల్వేకోడూరు(అన్నమయ్యజిల్లా) : ఏపీ ఎన్జీవో అసోసియేషన్ కార్యదర్శిగా రవీంద్ర వర్మను ఎన్నుకున్నట్లు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ తాలూకా అధ్యక్షులు పి.ఓబులేసు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్జీవో హోంలో ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు కార్యదర్శి రవికుమార్ ఆధ్వర్యంలో కార్యనిర్వహక సమావేశం నిర్వహించామని ఈ సమావేశంలో ఎన్నికల అధికారిగా జిల్లా కోశాధికారి నిత్య, పూజయ్య కార్యదర్శిగా రవీంద్ర వర్మ ను, ఉపాధ్యక్షులుగా విజరు కుమార్ను, జాయింట్ సెక్రటరీలుగా కిరణ్ కుమార్, ఎన్ ఉషారాణిని ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/ngo.jpg)