ప్రజాశక్తి – నెల్లిమర్ల : మిమ్స్ ఉద్యోగులు, కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న నిరశన సమ్మె గురువారం కొనసాగింది. స్థానిక ఆర్ఒబి వద్ద చేపడుతున్న సమ్మె శిబిరం 43వ రోజుకి చేరుకుంది. శిబిరానికి మున్సిపల్ ఎంపా ్లయిస్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఏ. జగన్ మోహన్ రావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మిమ్స్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు టివి. రమణ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె. సురేశ్ మాట్లాడుతూ గత 43రోజులుగా మిమ్స్ ఉద్యోగులు, కార్మికులు జనవరి నెల జీతాలు డి ఎ బకాయిల, వేతన ఒప్పందం చేయాలని నిరశన సమ్మె చేస్తుంటే యాజమాన్యం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం దుర్మార్గమన్నారు. పని చేసిన కాలానికి జనవరి నెల జీతాలు మూడు నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఇవ్వక పోవడం అన్యాయ మన్నారు. ప్రభుత్వం, మిమ్స్ యాజమాన్యం స్పందించి న్యాయమైన సమస్యలు పరిష్కరించి జనవరి నెల జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా కమిటి సభ్యులు కిల్లంపల్లి రామారావు, ఉద్యోగులు ఎం.నారాయణ, కె. కామునాయుడు, కె.మధు, గౌరి, మూర్తి, ఎం. నాగభూషణం, బెల్లాన బంగారునాయుడు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/03/nml-mims-8.jpg)