మొక్కలు నాటుతున్న అధ్యాపక బృందం
ప్రజాశక్తి-మండపేట
జీవకోటి మనుగడి కోసం పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పలువురు అధ్యాపకులు పేర్కొన్నారు. బుధవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ అధికారి డాక్టర్ నెహ్రు నాయక్ పరివేక్షణలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టీకేవీ శ్రీనివాసరావు కాలేజీ ఆవరణలో సుమారుగా 200 కొబ్బరి చెట్లు నాటారు. కళాశాల విరామ సమయంలో కాలేజీ రేడియోలో పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను తెలియజేసే వివిధ అంశాలను ప్రచారం చేయాలని పలువురు అధ్యాపకులు సూచించారు.