పారదర్శకంగా ఓటర్ల లిస్టు తయారు చేయాలిసబ్‌ కలెక్టర్‌ ఆదర్శ రాజేంద్రన్‌

ప్రజాశక్తి – ఆగిరిపల్లి

ఓటర్ల లిస్టులో వున్న మరణించిన వారి పేర్లు తొలగించటంతో పాటు, గ్రామాలను విడిచి వెళ్లినవారి వివరాలు పూర్తిగా సేకరించి ఎటువంటి తప్పులకు చోటు లేకుండా పారదర్శకంగా ఓటర్ల లిస్టులను తయారు చేయాలని నూజివీడు సబ్‌కలెక్టర్‌ ఆదర్శ రాజేంద్రన్‌ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన మండల పరిధిలోని బొద్దనపల్లి, చిన్నాగిరిపల్లి, ఈదులగూడెం గ్రామాలలో పర్యటింటి ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు.

➡️