దివి లింగయ్య నాయుడిని సన్మానిస్తున్న దృశ్యం
పోతురాజు స్వామి పొంగళ్లు
ప్రజాశక్తి-కందుకూరు :పట్టణంలోని పోతురాజు స్వామి గుడి వద్ద నెల పొంగళ్లు కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. గ్రామ దేవతల వారసత్వ ధర్మకర్త దివి లింగయ్య నాయుడు పర్యవేక్షణలో స్వామివారి కార్యక్రమాలు జరిగాయి. స్థానిక ముత్త రాశిపాలెం ఆచార దేవర ఇంటి నుంచి భోణం పొంగళ్లు పెట్టి అక్కడ నుంచి ఊరేగింపు నిర్వహించి పోతురాజు స్వామికి పొంగళ్ళు చెల్లించారు.పోతురాజు స్వామి ఆచార కార్యక్రమాలను సమర్ధవంతంగా చేసిన విధ్యావస్తుడు గొట్టిముక్కల గోవర్ధన్, కన్నమనీడు పల్నాటి చెన్నయ్య, రాధయ్య, పూజారులు మాల్యాద్రి, రామరాజు, గ్రామ పోతురాజు లకు దివి లింగయ్య నాయకుడు, పిడికిటి వెంకటేశ్వర్లు శాలువాతో సన్మానించారు. పోతురాజు స్వామి కార్యక్రమాలకు సహకారం అందిస్తున్న చికెన్ సెంటర్ సురేష్ రెడ్డి కి నిర్వాహక కమిటీ సత్కరించింది. మాదాల మాల్యాద్రి, మంగపాటి కష్టయ్య, పల్నాటి వీరుల ఆచారస్తులు చక్కా వెంకట కేశవరావు, చక్కా చెన్నకేశవరావు (శ్రీ లక్ష్మీ వాచ్), చక్కా సుబ్రహ్మణ్యం, మోసంగి ప్రసాద్, పిన్నంరాజు ప్రభాకర్, తొట్టెంపూడి వేణు, తల్లపనేని నరసింగరావు, బత్తిన కోటేశ్వరరావు ఉన్నారు.