ప్రజాశక్తి-విజయనగరం కోట : ఫిర్యాదుదారులకు తక్షణ న్యాయం చేయాలని ఎస్పి ఎం.దీపిక అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ వారం 44 ఫిర్యాదులు అందాయి. బాధితుల సమస్యలను తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడి, పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, న్యాయం చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్, దిశ డిఎస్పి ఆర్.శ్రీనివాసరావు, డిసిఆర్బి సిఐ జె. మురళి, ఎస్బి సిఐ ఇ. నర్సింహమూర్తి, ఎస్ఐలు సిద్ధార్థ్, ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/01/sp.jpeg.jpg)