- భవన నిర్మాణం పూర్తి కాకుండానే స్కూల్ ప్రారంభం
- పట్టణ పౌర సంక్షేమ సంఘం డిమాండ్
- విద్యా శాఖ అధికారికి వినతి
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : భవన నిర్మాణాలు పూర్తి కాకుండానే స్కూల్ ప్రారంభించిన నారాయణ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గురువారం సంఘం నాయకులు జిల్లా విద్యా శాఖ అధికారి ఎడి గౌరీ శంకర్కు వినతి పత్రం అందజేశారు. నోబుల్ నగరంలో నిర్మాణం జరుగుతున్న నారాయణ సిబిఎస్ ఈ స్కూల్ ప్రారంభించడం తగదన్నారు. భవనాలు నిర్మాణంలోనూ ఉండగా పాఠశాల ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. జిల్లా అధికారులు ఏ విధంగా అనుమతినిచారని నిలదీశారు. నిర్మాణ పనులు జరుగుతుండగా ఏదైనా ప్రమాదం జరగరాని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యుత తీసుకుంటారు. అని ప్రశ్నించారు. నారాయణ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. వినతి పత్రం అందచేసిన వారిలో సంఘం నాయకులు యుఎస్ రవికుమార్, బి.రమణ, పి.రమణమ్మ పాల్గొన్నారు.