ప్రజాశక్తి-కడప అర్బన్ వైసిపి ప్రభుత్వం విడుదల చేసిన దగా డిస్సిని రద్దుచేసి మెగా డిఎస్సిని ప్రకటించాలని డివైఎఫ్ఐ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి బి.మనోహర్, డివైఎఫ్ఐ నగర కార్యదర్శి ఓబులేసు డిమాండ్ చేశారు. శుక్రవారం డివైఎఫ్ఐ నగర కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖాళీగా ఉన్న 25వేల పూర్తి పోస్టులతో మెగా డిఎస్సిని విడుదల చేయాలని పేర్కొన్నారు. డిఎస్సి పోస్టుల సంఖ్య పెంచి, నోటీఫికేషన్ సమయం పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కారం చేయకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను భిక్షమెత్తేలా చేసిందని అన్నారు. డిఎస్సి పోస్టులు 25వేలుకు పెంచి మెగా విడుదల చేయాలని,117 జీవో రద్దు చేయాలని పేర్కొన్నారు. మెగా డిఎస్సీ కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన వాగ్దానాన్ని అమలు చేస్తారని ఎదురు చూసిన వారికి తాజా ప్రకటన నిరాశపరిచిందని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 25 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండగా కేవలం 6,100 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని ప్రకటించడం బాధాకరమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, విద్యా అనుబంధ రంగాల పోస్టులన్నీ భర్తీకి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 10 లక్షలకు పైగా నిరుద్యోగులు బిఇడి, టిటిసి పూర్తి చేసి అప్పులు చేసుకొని కోచింగ్ తీసుకుంటూ సంవత్సరాలుగా ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారని వాపోయారు. సుదీ ర్ఘకాలంగా యువజన సంఘాలు, నిరుద్యోగ యు వత పోరాడిన ఫలితంగా కంటి తుడుపు చర్యగా 6,100 పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారని, ఇది డిఎస్సి అభ్యర్థులను మోసగించే చర్య ని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన సంఖ్యను చూసి లక్షలాది మంది యువత నిరుత్సాహం చెందుతున్నారని వాపోయారు. ప్రకటించిన డిఎస్సిలోనూ అనేక నిబంధనలు పెట్టారు. ఎప్పుడో రద్దు చేసిన అప్రెంటిస్ విధానాన్ని పునఃప్రవేశపెట్టి రెండేళ్లు గౌరవ వేతనం ఇస్తామని ప్రకటించడం అన్యాయమన్నారు. రాష్ట్రంలో వివిధ రకాల ఉపాధ్యాయ పోస్టులు సుమారు 25 వేలు ఉన్నాయని, ఇవిగాక రానున్న జూన్లో మరిన్ని పోస్టులు ఖాళీ అవుతున్నాయని పేర్కొన్నారు. వీటన్నింటినీ దష్టిలో పెట్టుకొని మెగా డిఎస్సిని ప్రకటించాలని లేని పక్షంలో డివైఎఫ్ఐ గా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ మాజీ జిల్లా నాయకులు పి.వెంకటసుబ్బయ్య, పి.చంద్రారెడ్డి, నగర ఉపాధ్యక్షులు విజరు నాయకులు ఉదరు, వెంకటరామయ్య, డిఎస్సి అభ్యర్ధులు శ్రీనివాస్, శివ, జాన్, సుంకన్న, కిషోర్ పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/02/Untitled-6-copy-2.jpg)