ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఈనెల 25న విశాఖలో జరిగిన రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొన్న విజయనగరం యువకులు విజయ కేతనం ఎగుర వేశారనిజిల్లా బాడీ బిల్డర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రెడ్డి శంకర్రావు, కార్యదర్శి కోరాడ శ్రీనివాస రావు తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ విశాఖ భవాని గార్డెన్స్ పాత ఐటిఐ జంక్షన్ వద్ద నవ్యాంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో 80 కేజీల విభాగంలో దారపు సన్నిబాబు 5 వ స్థానం డి. రమణ 4 వ స్థానం , 55 కేజీ ల విభాగంలో అల్లు రాజేష్ విజేతలుగా నిలిచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వీరిని శంకర్రావు, శ్రీనివాసరావు అభినందించారు.