ఫొటో : మాట్లాడుతున్న ఎపిఎం ఖాజారంతుల్లా
వంద శాతం రికవరీ చేయాలి
ప్రజాశక్తి-ఉదయగిరి : విఒఎలు వందశాతం ఆగి ఉన్న బకాయిలను రికవరీ సాధించాలని వైఎస్ఆర్ క్రాంతిపథం పథకం ఎపిఎం ఖాజారంతుల్లా పేర్కొన్నారు. మంగళవారం ఉదయగిరి మండలంలో వైఎస్ఆర్ క్రాంతిపధ పథకంలో పనిచేసే విఒఎలు స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ రుణాల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించి నూరు శాతం రికవరీ సాధించాలని ఎపిఎం పేర్కొన్నారు. ఆయన స్థానిక స్త్రీశక్తి భవనంలో విఒఎలు, సిసిలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొదుపు సంఘాల సభ్యులతో కలిసి జలజీవన్ కమిటీలను గ్రామాల్లో ఏర్పాటు చేయాలన్నారు. అందుకు సంబంధించి బ్యాంకు ఖాతాలను ప్రారంభించాలన్నారు.
![ఫొటో : మాట్లాడుతున్న ఎపిఎం ఖాజారంతుల్లా](https://prajasakti.com/wp-content/uploads/2024/02/udg-2-1.jpg)