వైసిపి పాలనలో మహిళలకు రక్షణ కరువు

Mar 4,2024 21:40

 ప్రజాశక్తి-విజయనగరం కోట  : ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని నియోజకవర్గ టిడిపి , జనసేన ఉమ్మడి అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి అన్నారు. బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా సోమవారం 44వ డివిజన్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించి చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ హామీలను ప్రజలకు వివరించారు, యువతకు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు రావాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలన్నారు. మహిళలను అన్ని రంగాలలో పైకి తీసుకువచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే అన్నారు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, డ్వాక్రా సంఘాల ఏర్పాటు ద్వారా ఆర్ధిక పురోగతి, దీపం పధకం ద్వారా గ్యాస్‌ కనెక్షన్లు, రాజకీయాలలో మహిళలకు రిజర్వేషన్లు వంటి అనేక పథకాలను రూపొందించి మహిళాభ్యుదయానికి కృషి చేసారన్నారు. కానీ వైసిపి పాలనలో నేడు మహిళలకు కనీసం రక్షణ కరువైందన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, కార్యాలయ కార్యదర్శి రాజేష్‌ బాబు, పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్‌, మండల పార్టీ అధ్యక్షులు బొద్దల నర్సింగరావు, కార్యదర్శి గంటా పోలినాయుడు, రాష్ట్ర బిసి నాయకులు వేచలపు శ్రీనివాసరావు, అవనాపు విజరు, పిల్లా విజరు కుమార్‌, టిడిపి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయ్యన్నపేటలో సోమవారం జయహో బిసి కార్యక్రమం జరిగింది. స్థానిక వార్డులకు చెందిన బిసిలు, టిడిపి,జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️