సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌

మండపేటలో సమ్మె చేస్తున్న మున్సిపల్‌ కార్మికులు

ప్రజాశక్తి-మండపేట

స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద సమస్యల పరిష్కారం కోరుతూ మునిసిపల్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారానికి నాటికి 11వ రోజుకు చేరుకుంది. సందర్భంగా ్ట కార్మికులు డిమాండ్లతో కూడిన ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం పలువురు కార్మిక నాయకులు మాట్లాడుతూ నిత్యం పట్టణ ప్రజల ఆరోగ్య కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి పట్టణ పరిశుభ్రత కోసం పనిచేసే కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం వెనకడుగు వేయడం సరికాదన్నారు. గత 10 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు జీతాలు ప్రభుత్వం పెంచాలన్నారు. కనీస వేతనం రూ.26వేల ఇవ్వాలని, సిఎం జగన్‌ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పిఎఫ్‌ ఈ ఎస్‌ ఐ, పింఛన్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు లోవరాజు, విజరు, సవరపు సరోజిని, బంగారు అన్నవరం, మల్లవరపు సువార్త, మడికి హేమలత, సిహెచ్‌ వెంకటలక్ష్మి, భాను, సన్యాసమ్మ తదితరులు పాల్గొన్నారు.

 

➡️