మండపేటలో డిమాండ్ల సాధనకు సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులు
ప్రజాశక్తి-మండపేట
స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు చేపట్టిన సమ్మె మంగళవారం నాటికి 15వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పలువురు కార్మిక నాయకులు మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు జీతాలు ప్రభుత్వం పెంచాలన్నారు. కనీస వేతనం రూ.26వేల ఇవ్వాలని, సిఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పిఎఫ్ ఇఎస్ఐ, పింఛన్ సౌకర్యం కల్పించాలని కోరారు. గత 15 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదష్టకరమన్నారు. కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు బంగారు కొండ, కొమరపు నరేంద్ర కుమార్, లోవరాజు, సవరపు సరోజినీ, బంగారు అన్నవరం, మల్లవరపు సువార్త, మడికి హేమలత, సిహెచ్.వెంకటలక్ష్మి, భాను, సన్యాసమ్మ తదితరులు పాల్గొన్నారు.