సమస్యల పరిష్కారానికి పెద్దపీట

జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయం. రాష్ట్రప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి ఉద్యోగీ ఇకెవైసి చేయించుకోవాలి. దీనికితోడు జిల్లాలోని డ్రాయింగ్‌ ఆఫీసర్లు తమ శాఖల పరిధిలోని అకౌంట్లను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. సిఎఫ్‌ఎంఎస్‌ అమలు నేపథ్య ంలో ట్రెజరీ అధికారులపై అదనపు భారం పడింది. ఎపిఎస్‌ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు ట్రెజరీ పరిధిలోకి వచ్చింది. వైద్య ఆరోగ్యశాఖ కూడా ప్రభుత్వ పరిధిలో రానున్న నేపథ్యంలో మరింత భారంగా మారే అవకాశం కనిపిస్తోందని పేర్కొంటున్న ట్రెజరీస్‌ డిడి ఎం. ఎస్‌ వెంకటేశ్వర్లుతో ముఖాముఖి…ప్రజాశక్తి- కడప ప్రతినిధిజిల్లాలోని సబ్‌ట్రెజరీ కార్యాలయాలెన్ని? జిల్లాలో తొమ్మిది సబ్‌ట్రెజరీ కార్యాల యాలున్నాయి. కడప, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, ముద్దనూరు, కమలాపురం, పులి వెందుల, బద్వేల్‌, సిద్ధవటం, ప్రాంతాల్లో ఉన్నాయి.ట్రెజరీ కార్యాలయాల పనులేమిటి? జిల్లాలోని ట్రెజరీ కార్యాలయాలు ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లు చెల్లింపులు, వాటి రికార్డులను నిర్వహించడం, కొత్తగా చేరిన ఉద్యోగులకు ఐడి, ఇతర రికార్డులను నిర్వహించడం, పీడీ అకౌంట్ల నిర్వహణ, స్ట్రాంగ్‌రూమ్‌ నిర్వహణ, ఆప్కోస్‌, కాంట్రాక్టు, క్లాస్‌- 4 ఉద్యోగుల సమస్యలను పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది.ఇకెవైసి నమోదు ఎలా ఉంది? జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా ఇకెవైసిపి చేయించుకోవాలి. ఇప్పటివరకు ఉద్యోగులు 99 శాతం, పెన్షనర్స్‌ 99 శాతం నమోదు చేశాం.ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు తెలపండి? జిల్లాలో 22 వేల మంది ఉద్యోగులు, 18 వేల మంది పెన్షనర్స్‌ ఉన్నారు. ప్రతి నెలా సదరు ఉద్యోగుల జీతభత్యాల, పెన్షన్స్‌, వంటి ఇతర చెల్లింపులు ప్రక్రియ నడుస్తోంది. వీటితోపాటు రిటైర్డు ఉద్యోగుల బకాయిలు, గ్రాట్యూటీ చెల్లింపులను చేయడం గమనార్హం.ట్రెజరీ చెల్లింపుల గురించి తెలపండి? ప్రతిఏటా ట్రెజరీశాఖ ద్వారా రూ.514 కోట్లు మేర ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షనర్లకు సంబంధించి పెన్షన్ల రూపంలో చెల్లింపులు చేయడం జరుగుతోంది.పీడీ అకౌంట్లు కలిగిన డిపార్టుమెంట్లు ఎన్ని? జిల్లాలో 10 శాఖల వరకు ఉన్నారు. ఇందులో వైద్య ఆరోగ్య శాఖ, డ్వామా, స్పోర్ట్‌స్కూల్‌, యూనివర్శిటీ, ఆర్కిటెక్షర్‌ యూనివర్శిటీ సహా ఇతర శాఖల పరిధిలోని ఉద్యోగులు ఉన్నారు. వీటి పరిధిలోని ఉద్యోగులకు పీడీ అకౌంట్ల ద్వారా జీతభత్యాలు చెల్లింపులు చేస్తున్నాం.ఆప్కోస్‌, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఎంతమంది? ఆప్కోస్‌ కింద 3,600 మంది, ఔట్‌సోర్సింగ్‌ కింద 1100, కాంట్రాక్టు ఉద్యోగులు 2,000 మంది వరకు ఉన్నారు.సబ్‌ట్రెజరీ భవన నిర్మాణ పనుల గురించి చెప్పండి? జిల్లాలో సిద్ధవటం, జమ్మలమడుగు, ముద్దనూరు సబ్‌ట్రెజరీ భవన నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ప్రతి సబ్‌ట్రెజరీ భవనానికి రూ.కోటి వ్యయంతో టెండర్లు పిలిచాం. కాంట్రాక్టర్లు ముందుకు వచ్చిన వెంటనే పనులు చేపడతాం.ఆన్‌లైన్‌ నమోదు ఎంతవరకు వచ్చింది? జిల్లాలోని ప్రభుత్వశాఖల అకౌంట్లను ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియ మధ్యస్థంగా సాగుతోంది. జిల్లాలోని 1200 మంది డ్రాయింగ్‌ ఆఫీసర్లు వేగం పెంచాలి.రాబోయే వీడియో కాన్ఫరెన్స్‌ సమయానికి ఆశించిన పురోగతిని చూపించాల్సిన అవసరం ఉంది.

➡️