ప్రజాశక్తి – విజయపురిసౌత్ : నాగార్జునసాగర్ కుడికాల్వకు సోమవారం నీటిని విడుదల చేశారు. కృష్ణానది యాజమాన్య బోర్డు సభ్యులు అజరు కుమార్గుప్తా పర్యవేక్షణలో కుడికాల్వ 5, 7వ గేట్ల ద్వారా గేటుకు 2,500 క్యూసెక్కుల చొప్పున రెండు గేట్ల ద్వారా 5 వేల క్యూసెక్కులను నాగార్జునసాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ మురళీధర్రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగునీటి అవసరాల నిమిత్తం 5 టిఎంసీలను రోజుకు 5 వేల క్యూసెక్కుల చొప్పున 11 రోజుల పాటు విడుదల చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కృష్ణానది యాజమాన్య బోర్డు ఇఇలు రఘునందన్రావు, శివశంకర్, లింగంగుంట్ల సర్కిల్ ఎస్ఇ వరలక్ష్మి, సాగర్ ప్రాజెక్టు ఇఇ శ్రీహరి, డీఈలు మురళీధర్, వెంకటసుబ్బయ్య, జేఈలు బాబుమియా, భారతి పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/01/vps-2.jpg)