ప్రజాశక్తి – శ్రీకాకుళం : ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం వల్ల ఆ ప్రభావం వలంటీర్లపై పడింది. పాతపట్నం మేజర్ పంచాయతీ పరిధిలోని 3 సచివాలయాల్లో 121 మంది వలంటీర్లకు గాను 69 మంది వలంటీర్లు గురువారం స్థానిక ఎంపిడిఓ కె.రామకృష్ణ రాజు కి రాజీనామాలు సమర్పించారు.