ప్రజాశక్తి-రామచంద్రపురం (కోనసీమ) : ద్రాక్షారామ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోషల్ ఉపాధ్యాయులుగా పనిచేసి పదవీ విరమణ పొందిన ఎం.శ్రీరామచంద్రమూర్తిని ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి మానుపూడి శ్రీనివాస్, నాగేశ్వరి, జిల్లా ఉప విద్యాశాఖ అధికారి ఎస్ఎల్.నరసింహ ఫణి పాల్గని ప్రసంగించారు. సామాజిక చైతన్యం సోషల్ బోధన ద్వారా మాత్రమే తెలుస్తుందని ఉపాధ్యాయుని నిర్విరామ కఅషికి వారి వద్ద నేర్చుకున్న విద్యార్థులు ఉన్నత స్థానంలో ఉండడమే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ శ్రీ రామచంద్రమూర్తి మాస్టారు అని కొనియాడారు. సర్వీసు మొత్తంలో అత్యంత తక్కువ సెలవులు ఉపయోగించిన ఉపాధ్యాయుడిగా అందరి మన్ననలు పొందిన వ్యక్తి శ్రీరామచంద్రమూర్తి అని వారి ప్రత్యేకంగా ప్రశంసించారు. ఉన్నత విద్యా సేవ అంటే చిట్ట చివరి క్షణం వరకు తరగతి గదిలో బోధన చేయడమే ఆ విషయంలో 100 శాతం విజయం సాధించారని సభ లో వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయిని సిహెచ్ రత్న పద్మావతి, జిల్లా సైన్స్ అధికారి జివిఎస్.సుబ్రహ్మణ్యం, వెన్నపు వీరభద్రరావు, యుటిఎఫ్ నాయకులు పాకలపాటి శ్రీనివాసరావు, యుటిఎఫ్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దేవి , చైతన్యబాబు, అరవ విశ్వేశ్వరరావు, గుణ్ణం రాజేశ్వరి, వివిధ పాఠశాల ఉపాధ్యాయుడు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/07/teacher.jpg)