వాటర్ ట్యాంక్ ను రీపెర్ చేయండి

Jul 3,2024 10:27 #anakapalle district

ప్రజాశక్తి-దేవరాపల్లి : వాలాబు పంచాయతీ చివారు పాత వాలాబులో వాటర్ ట్యాంక్ ను రీపెర్ చేసి మంచినీటి సౌకర్యం కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న మండల కార్యదర్శి బి టి దొర డిమాండ్ చేసారు. బుధవారం నిరుపయోగంగా ఉన్న వాటర్ ట్యాంక్ ను పరీశీలించిన అనంతరం వారు మాట్లాడారు. పాత వాలాబులో సుమారుగా 250 వరకు జనాభా నివాసం ఉంటున్నారని తెలిపారు. జల జీవన్ మిషన్ లో ఇంటిఇంటికి కోళాయిలు మంజూరు చేసిన, ఓక్కపూటె గంటకు మించి నీళ్లు ఇవ్వడం లెదన్నారు. ఈవాట్ ట్యాంక్ ను రీపెర్ చేయడం వలన గ్రామం అంతా మంచినీటి సౌకర్యం కలుగుందని తెలిపారు. కాని ఆరు నేలలు నుండి పని చేయక పోయిన ఆదికారులు పట్టించుకోవడం లెదన్నారు. జనాభా ఎక్కువగా ఉండడంతో మంచినీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కోన్ని సందర్బాల్లో కోళాయిలు పనిచేయక పోతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గతంలో ఈ వాటర్ ట్యాంక్ నే వాడు కోనె వారని ఈట్యాంక్ రీపెర్ చేస్తె గ్రామంలో పూర్తి స్థాయిలో మంచి నీటి సమస్యను, పరిష్కారం చేయవచ్చునని వెంటనే వాటర్ ట్యాంక్ రీపెర్ చేయించి పూర్తి స్థాయిలో మంచినీటి సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేసారు.

➡️