ప్రజాశక్తి-పుట్లూరు(అనంతపురం జిల్లా) : మండల కేంద్రంలోని చెరువులోకి దిగి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సూరి మాట్లాడుతూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ టీచర్ల సమస్యలు హెల్పర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మరింత ఉధృతంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఏవైతే డిమాండ్లు పెట్టారు నెరవేరిచే వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని ఈ సమ్మె కూడా ఇలానే కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించినా కరుణ కనికరం లేని ప్రభుత్వం అని అంగన్వాడి టీచర్లు వాపోతున్నారు. మా డిమాండ్ నెరవేరిచే వరకు అనేకమైన రూపాల్లో కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పుట్లూరు మండల కమిటీ నాయకులు రైతు సంఘం మండల కార్యదర్శి వెంకట చౌదరి, బి భాస్కర్ రెడ్డి టీ పెద్దయ్య, నాగభూషణ్, అంగన్వాడి అధ్యక్షురాలు జయలలిత, శశికళ, అనంతలక్ష్మి, అనంతలక్ష్మి, రమాదేవి, టీచర్లు హెల్పర్లు తదితరులు పాల్గొన్నారు.