ఆర్డీవోలు, తహశీల్దార్లతు మాట్లాడుతున్న కలెక్టర్ డా||వి.వినోద్ కుమార్
అనంతపురం కలెక్టరేట్ : పెండింగ్లో ఉన్న కోర్టు కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా||వి.వినోద్ కుమార్ ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో రెవెన్యూ లీగల్ అంశాలపై ఆర్డీవోలు, తహశీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. డివిజన్ వారీగా కోర్టు కేసుల పెండింగ్ ను జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోర్టు కేసులను రోజుకు ఒకటి చొప్పున వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఒక పద్ధతి ప్రకారం వీటిని పరిష్కరించడంపై దృష్టి సారించాలని సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, డిఆర్ఒ జి.రామకృష్ణారెడ్డి, ఆర్డీవోలు, జి.వెంకటేష్ వి.శ్రీనివాసులురెడ్డి, రాణి సుస్మిత, కలెక్టరేట్ ఏవో అంజన్ బాబు, తహశీల్దార్లు పాల్గొన్నారు.