పేదల సంక్షేమమే టిడిపి లక్ష్యం

Jul 1,2024 16:46 #Annamayya district

– ఎమ్మెల్యే నల్లారి కిషోర్ రెడ్డి
ప్రజాశక్తి-కలికిరి : పేద ప్రజల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ప్రధాన లక్ష్యం అని ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం కలికిరి పట్టణంలో ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన పెన్షన్లు వెయ్యి రూపాయలు పెంచుతూ సోమవారం అర్హులైన ప్రతి ఒక్కరికి 4000 రూపాయలతో పాటు ఏప్రిల్ మే జూన్ నెలలోని 1000 రూపాయలు తో కలిపి 7000 రూపాయలు పెన్షన్ అర్హులైన ప్రతి ఒకరికి ఇవ్వడం జరిగిందని, ఇలాగే ప్రతి ఒక్క హామీని తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసి ప్రజా సంక్షేమం లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్లారి చంద్ర రెడ్డి లక్ష్మీకర్ రెడ్డి, మండల టిడిపి అధ్యక్షుడు నిజాముద్దీన్ ఉపాధ్యక్షుడు రెడ్డి, రెడ్డివారి యోగేష్ రెడ్డి, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️