ప్రజాశక్తి – మార్టూరు రూరల్ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు,కార్మిక వ్యతిరేఖ విధానాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా,కార్మిక సంఘాల ఐక్యవేదిక ఇచ్చిన పిలుపుమేరకు మార్టూరులో పలు వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు స్వచ్ఛందంగా మూసివేశారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల హనుమంతరావు, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.