ప్రజాశక్తి – పర్చూరు
మండలంలోని తిమ్మరాజుపాలెం వద్ద వరద ముంపు కి గురైన ప్రాంతాలను జాయింట్ కలెక్టర్ శ్రీధర్ పరిశీలించారు. నాగులపాలెం పునరావాస బాధితులకు జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, మండల స్పెషల్ ఆఫీసర్ డిఎం అండ్ హెచ్ఒ విజయలక్ష్మి, తహశీల్దారు కె సంద్యశ్రీ, డిఎస్పి వెంకటేశ్వర్లు, ఆర్ఒ వెంకటరమణ, ఎంపీడీఒ ప్రద్యుమ్నకుమార్, ఎస్ఐ రవిశంకర్రెడ్డి, ఆర్ఐ ప్రేమ్ కుమార్ సమక్షంలో నగదు, సరుకులు పంపిణీ చేశారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/PRC-JC.jpg)