క్షయ వ్యాధి నివారణ దినోత్సవం

Mar 24,2024 13:59 #Bapatla District

ప్రజాశక్తి-అద్దంకి  : ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా హెల్ఫ్ టిఐ వారి ఆధ్వర్యంలో అద్దంకి డిఐసి పరిధిలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించటం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి వి కరుణ అధ్యక్షత వహించగా, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డాక్టర్ శరత్ కుమార్ పాల్గొన్నారు. ఈ వ్యాధి చాలా ప్రమాదకరం అని, రాకుండా ముందు జాగ్రత్త లు తీసుకోవాలన్నారు. వచ్చిన తరువాత, ఆలస్యం, అశ్రద్ధ చేయకుండా మందులు వాడుకోవాలన్నారు. దీనిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టి శ్రావణి, పిఈ లు పార్వతి,సంధ్య మరియు ఇతర కమ్యూనిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.

➡️