చేపల వర్తకులపై ఆకస్మిక దాడులు – కేసులు నమోదు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : విజయనగరం పట్టణంలో పలు కూడళ్ళు వద్ద లీగల్‌ మెట్రాలజీ అధికారులు చికెన్‌, మటన్‌, చేపల వర్తకులపై ఆదివారం పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. చట్టవిరుద్ధమైన తూనిక రాళ్ళు వినియోగించి వినియోగదారులను మోసగిస్తున్న ముగ్గురు చేపల వర్తకులపై కేసులు నమోదు చేశారు. ఇంకోసారి ఇలాంటి మోసాలు చేస్తే భారీగా అపరాధ రుసుము విధిస్తామని లేదా క్రిమినల్‌ కేసులు నమోదు చేసి జైలు కు పంపుతామని వర్తకులను పోలీసులు హెచ్చరించారు. అదేవిధంగా వినియోగదారులు కూడా మోసాల పట్ల అవగాహన కలిగియుండాలని దాని కోసం నెలలో రెండు చోట్ల అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తూకంలో లేదా కొలతల్లో ఎక్కడైనా మోసాలు గుర్తిస్తే తమ శాఖకు తెలుపవచ్చని ఇన్‌స్పెక్టర్‌ యం.దామోదర నాయుడు అన్నారు.

➡️