సిఎం జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి

Dec 12,2023 15:12 #Kadapa

ప్రజాశక్తి – వేంపల్లె : అంగన్వాడీలకు సిఎం జగన్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఎఐటియుసి జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ కెసి బాదుల్లా డిమాండ్ చేశారు. మంగళవారం అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న సమ్మెలో భాగంగా వేంపల్లె ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట ఏఐటియుసి,సిఐటియు అంగన్వాడీ కార్యకర్తల యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు బైఠాయించి నిరవధిక సమ్మె చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం రూ 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.తెలంగాణ కన్నా అదనంగా రూ 1000 వేతనం ఇస్తానని చెప్పిన జగన్‌మోహన్‌రెడ్డి రెడ్డి మాటలు ఏమైనాయని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీని తక్షణమే అమలు చేయాలన్నారు. అలాగే మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చి, మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. ఐసిడిఎస్ కు బడ్జెట్ కేటాయింపులు చేసి నిధులు పెంచి, ఫ్రీ స్కూల్ బలోపేతం చేయాలని చెప్పారు. అర్హులైన హెల్పర్స్ కు ప్రమోషనుల నిబంధనలను రూపొందించి, ప్రమోషన్ల వయస్సు 50 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న 2017 టిఏ, డిఏతో పాటు ఇతర బకాయిల బిల్లులను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో యూనియన్ నాయకురాలు సరస్వతి, ప్రభావతి, లలితమ్మ, సావిత్రి, భాగ్యలక్ష్మి, శైలజ, శాంతకుమారి, శ్యామల, లక్ష్మి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఓబులేసు, అంగన్వాడీలు పాల్గొన్నారు.

➡️