మచిలీపట్నం వైపు దూసుకువస్తున్న ‘మిచౌంగ్‌’

cylone impact on machilipatnam

ప్రజాశక్తి-కృష్ణా జిల్లా : ‘మిచౌంగ్‌’ తుఫాన్ మచిలీపట్నం వైపు దూసుకువస్తుంది. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా అధికారులు అప్రమత్తమైన్నారు. మచిలీపట్నం – బాపట్ల మధ్య తీరం దాటవచ్చు అన్న సమాచారంతో అధికారులు రైతులను కీలక ఆదేశాలు చేశారు. పంట చేతికి వచ్చే సమయంలో తుఫాను రావటంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కోసిన దాన్యం మొత్తాన్ని రైస్ మిల్లులకు చేరవేయాలని ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాల్లో పునరావస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. వేటకు వెళ్ళిన మత్స్యకారులు అందరినీ వెనక్కు పిలిపించి వారిని అప్రమత్తం చేశారు.
నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి మండలంలో కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేశారు. ఇప్పటికే తుఫాను దృష్ట్యా పాఠశాలలకు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. అవనిగడ్డ డిఎస్పి మురళీధర్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేసి NDRF బృందాలను కూడా సిద్ధంగా ఉంచారు. భారీ తుఫాన్ నేపథ్యంలో రెవెన్యూ, పోలీస్, అగ్రికల్చర్, ఫిషరీస్, విద్యుత్ శాఖల అధికారులను అప్రమత్తం చేశారు.

➡️