ముత్యాల పోసి కుమార్ కు డాక్టరేట్ ప్రధానం

Mar 28,2024 12:59 #East Godavari

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్ : ముత్యాల పోసి కుమార్ కు గురువారం నాడు డాక్టరేట్ ను ప్రధానం చేశారు. ఇటీవల హైదరాబాద్ లైన్స్ భవనంలో హోప్ తి యా లాజికల్ యూనివర్సిటీ న్యూఢిల్లీ వారి ఆధ్వర్యంలో గౌరవ డాక్టరేట్స్ ప్రధానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు మాజీ మంత్రివర్యులు వేణుగోపాల చారి. డాక్టర్ బి మధుసూదన్ రిటైర్డ్ జడ్జ్. రిటైర్డ్ ఐఏఎస్ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ చందన వర్ధన్ చేతుల మీదగా స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముత్యాల. పోసి కుమార్ కు హోప్ తీయలాజికల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రధానం చేశారు. ఈ సందర్భంగా తాను చేస్తున్న సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్ అందించిన సంస్థ వారికి విచ్చేసిన అతిధులకు పోసి కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు పండు ప్రేమ్ కుమార్, కే. జ్యోతి మాట్లాడుతూ స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముత్యాల. పోసి కుమార్ దివ్యాంగులకు వృద్ధులకు ఎంతో సేవ చేశారని గత నాలుగు సంవత్సరములుగా నిత్య అన్నదానంతో ఎంతోమంది భేద సాధల ఆకలి తీరుస్తున్నారని ఇలాంటి మంచి వ్యక్తికి డాక్టరేట్ మా యూనివర్సిటీ ద్వారా ప్రధానం చేయటం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కొమ్ము ప్రవీణ్ కుమార్, డాక్టర్ డేవిడ్ పాల్, సినీ యాక్టర్ ముఖేష్, హోప్ తీయ లాజికల్ యూనివర్సిటీ ప్రతినిధులు పాల్గొన్నారు

➡️