ఉచితం న్యాయం కోసం పోలీస్ కంప్లైంట్ అథారిటీ ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్ పోలీసు అధికారులు విధులను దుర్వినియోగం చేస్తే సామాన్యుడు జిల్లాస్థాయి పోలీసు కంప్లైంట్ అథారిటీకి నేరుగా ఫిర్యాదు చేయవచ్చని, తగిన న్యాయం పొందవచ్చునని జిల్లాస్థాయి పోలీసు కంప్లైంట్ అథారిటీ చైర్మన్, రిటైర్డు జడ్జి ఆర్జె.విశ్వనాథం అన్నారు. గురువారం బొమ్మూరులోని వైటిసి ప్రాంగణంలోని అథారిటీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ విశ్వనాథం మాట్లాడుతూ పోలీసుల నుంచి సత్వర న్యాయం అందని సందర్భాల్లో సామాన్యుడికి ఉచితంగా న్యాయం అందించేందుకు జిల్లా స్థాయి పోలీసు కంప్లైంట్ అథారిటీని నియమించినట్టు తెలిపారు. ఏడు జిల్లాలకు సంబంధించి రాజమండ్రి బొమ్మూరులో కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు. కమిటీ మెంబర్లుగా రిటైర్డు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం.జితేంద్ర, రిటైర్డ్ అడిషనల్ ఎస్పి బి.లక్ష్మీనారాయణ, అడ్వకేట్ సిహెచ్.మన్మధరావు వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. సామాన్యులను, ప్రజలను పోలీసులు ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే స్వయంగా 9948464363కు ఫోన్ చేయవచ్చని, సజూషaతీajaఎaష్ట్రవఅసతీaఙaతీaఎఏస్త్రఎaఱశ్రీ.షశీఎ కు మెయిల్ చేయవచ్చునని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 14 కేసులు వస్తే పదింటిని పరిష్కరించామమని తెలిపారు.