ప్రజాశక్తి – ముసునూరు
సేవా దృక్పధంతో సేవ చేయాలనే ఉద్ధేశ్యంతో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న బాలురకు ముసునూరు ఎస్ఐ పి.వాసు ఆర్థిక సహాయం అందజేశారు. మంగళవారం రాజమండ్రి పరిధిలోని నమావరం అనే గ్రామానికి చెందిన మూడు సంవత్సరాల మని భార్గవ్ గుంటూరు భ్లూసమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోషల్ మీడియా ద్వారా ఆర్థిక సహాయం కోరగా, ఎస్ఐ వాసు రూ.80 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. మండల అధికారులు, ప్రజలు, పోలీస్ శాఖాధికారులు అభినందనలు తెలియజేశారు.