ముసునూరు : టిడిపి అధికారంలోకి రాగానే మహిళలకు పెద్దపీట వేస్తుందని రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ గద్దె రఘుబాబు అన్నారు. శుక్రవారం మండలంలోని బలివే గ్రామంలో బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి నాయకులు చిన్నం శ్రీనివాసరావు, పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/IMG-20231228-WA0309.jpg)