ప్రజాశక్తి – పోలవరం
పోలవరం మండల కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ముచ్చిక సీత ఎంపిక పట్ల పోలవరం మండల కాంగ్రెస్ నాయకులు సంకురు బాబురావు, తోలేటి రఘు, మూర్తి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం దేవరగొంది పునరావాస కాలనీలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంకురు బాబూరావు నివాసం వద్ద పార్టీ మండల అధ్యక్షురాలు ముచ్చిక సీత అధ్యక్షతన కాంగ్రెస్ మండల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముచ్చిక సీత మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించింది కాంగ్రెస్ అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ని బలోపేతం చేయడానికి, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడానికి కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ని గెలిపిస్తే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని తెలిపారు.