టార్గెట్‌ పిఠాపురం

Mar 20,2024 23:55
ఎన్నికలు దగ్గర పడే కొలది కాకినాడ జిల్లాలో

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

ఎన్నికలు దగ్గర పడే కొలది కాకినాడ జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా పిఠాపురం నుంచి పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేస్తుండడంతో ఇక్కడి రాజకీయాలు ఆశక్తిగా మారాయి. సీనియర్‌ నాయకురాలు వంగా గీత, పవన్‌ కళ్యాణ్‌ మధ్య పోటీ నెలకొనడంతో రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌ టాఫిక్‌ గా మారింది. దీంతో అటు అధికార వైసిపి, ఇటు కూటమి నేతలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ను ఓడించే లక్ష్యంగా అధికార పార్టీ ప్రణాళికలు వేస్తోంది. ఈ నియోజకవర్గంపై ప్రత్యేక ఫోకస్‌ను పెట్టింది. ప్రతిష్టాత్మకంగా తీసుకుని పని చేసేందుకు సిద్ధమవుతోంది. సామాజికవర్గాల వారీగా ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు, పరిస్థితులను సానుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నాలను ప్రారంభిం చింది. ఈ నియోజకవర్గంలో 90 వేలకు పైగా కాపు సామాజిక వర్గ ఓటర్లు ఉండడంతో వాటిపైనే ఆశలు పెట్టుకున్న పవన్‌ కళ్యాణ్‌ ఇక్కడ పోటీపై ఆసక్తిని చూపుతున్నారు. భారీ మెజా రిటీతో విజయం సాధించాలనే లక్ష్యంగా శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తు న్నారు. ఆయనకు ధీటుగా వైసిపి కూడా అన్ని సామాజిక వర్గాలను ఆకర్షించేలా ప్రయత్నాలను ప్రారంభించింది.రంగంలోకి కీలక నేతలుజనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ గట్టి పోటీ ఇవ్వనున్న నేపథ్యంలో వైసిపి తన ప్లానింగ్‌లో మరిన్ని మెరుగులు దిద్ది వ్యూహా త్మకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. పవన్‌పై బ్రహ్మాస్త్రాలను ప్రయో గించాలని ఆ పార్టీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో మండలాల వారీగా ఇన్‌ఛార్జుల నియమాకం చేపట్టింది. ఈ నియోజకవర్గంలో పిఠాపురం, గొల్లప్రోలు, యు.కొత్తపల్లి మండలా లుండగా అధిష్ఠానం సూచనలతో ఉభయ గోదావరి జిల్లాల రీజనల్‌ కో ఆర్డినేటర్‌ మిధున్‌రెడ్డి రంగంలోకి దిగారు.గొల్లప్రోలు మండలానికి మాజీ మంత్రి కురసాల కన్నబాబును, యు.కొత్తపల్లి మండలానికి మంత్రి దాడిశెట్టి రాజాలను ఇన్‌ఛార్జులుగా నియమించారు. పిఠాపురం మండలానికి మిథున్‌ రెడ్డి బాధ్యతలు చూసేలా ప్రణాళికను రూపొందించారు. దానికి తోడు నియోజకవర్గ కాపు నాయకుల కోసం ముద్రగడను రంగంలోకి దింపారు. ఇప్పటికే ఆయన గొల్లప్రోలులో కొంతమంది ముఖ్య నాయకులతో రహస్యంగా సమావేశం అయ్యారు. ఎన్నికల వ్యూహాలను అమలు చేసేందుకు కాకినాడ సిటీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, ఆయన అనుచరులు కూడా సన్నద్ధం అవు తున్నారు. రెండు రోజుల క్రితం యు.కొత్తపల్లి మత్స్యకార నాయకులతో దాడిశెట్టి రాజా భేటీ అయ్యారు. భారీ అంచనాలతో పవన్‌గత ఎన్నికల్లో భీమవరం, గాజువాకల నుంచి పోటీ చేసి ఓటమి చవిచూసిన పవన్‌ కళ్యాణ్‌ ఈసారి పిఠాపురంపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. ఎలాగైనా గెలుపే లక్ష్యంగా తనదైన శైలిలో వ్యూహాలు రచిస్తున్నారు. దీంతో ఆయన ఈ నియోజకవర్గంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. లక్ష ఓట్లు మెజారిటీ రావాలని కేడర్‌కు పిలుపునిచ్చారు. తాజాగా మంగళవారం మంగళగిరిలో జరిగిన నియోజకవర్గ నాయకుల భేటీలో ఈ అంశంపై చర్చించినట్లు సమాచారం. కొంతమంది టిడిపి, వైసిపి నాయకులు పవన్‌ సమక్షంలో ఆ పార్టీ కండువాలు కప్పుకున్నారు. వారిని ఉద్దేశించి పవన్‌ మాట్లాడారు. దేశంలోనే పిఠాపురం నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని చెప్పుకొచ్చారు. నియోజక వర్గంలో ప్రధాన సమస్యల పరిష్కారానికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళతానని తెలిపారు. ఇదే సందర్భంలో వైసిపి అభ్యర్థి వంగా గీతపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 2009లో ఆమె పిఆర్‌పి ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారని, భవిష్యత్తులో వైసిపిని వీడి జనసేనలోకి రావాలని కోరుకుంటు న్నానన్నారు. దీనిపై ఘాటుగా స్పందించిన వంగా గీత 2009 కంటే ముందు నుంచే నేను రాజకీయాల్లో ఉన్నానని, 2009లో చిరంజీవి నాకు అవకాశం ఇచ్చారన్నారు. పవన్‌ కళ్యాణ్‌ చెప్పి నట్లు మెజార్టీ కోసమే ఎన్నికలు జరుగుతున్నాయని, అది వంగా గీతా మెజారిటీ కోసం జరుగుతున్నాయని కౌంటర్‌ ఇచ్చారు. నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల మద్దతు నాకే ఉంది. పిలిస్తే పలికే వాళ్ళని ప్రజలు గెలిపిస్తారన్నారు. ఇదిలా ఉండగా ఈనెల 28న నియోజకవర్గానికి రానున్న ఆయన మూడు రోజులపాటు పర్య టించి ఎన్నికల నేపథ్యంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశం కాను న్నారు. మరోవైపు టిడిపి నేత వర్మ కూడా మద్దతు పలకడంతో మిగిలిన వర్గాల ఓటర్లను కూడా ఆకట్టుకునేందుకు పవన్‌ సిద్దపడుతున్నారు.చేరికలపై ప్రధాన దృష్టిమంగళవారం కొంతమంది వైసిపి, టిడిపి నాయకులు, కార్యకర్తలు జనసేన కండువాలు కప్పుకోగా ఈ నేపథ్యంలో జనసేన నాయకులను వైసిపి టార్గెట్‌ చేస్తుంది. గతంలో జనసేన పిఠాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా పనిచేసిన మాకినీడి శేషుకుమారి, ఆమె అను చరులు వైసిపిలో బుధవారం చేరారు. సిఎం జగన్‌ సమక్షంలోనే ఆమె వైసిపి కండువా కప్పుకున్నారు. చేరికలు అనంతరం సీఎం జగన్‌ వంగా గీత, ముద్రగడ పద్మనాభంలతో భేటీ అయ్యారు. స్థానిక రాజకీయ పరిస్థి తులు, గెలుపు ఓటముల అంచనాలపై చర్చించినట్లు సమాచారం.

➡️