పిఆర్‌ డిగ్రీ కళాశాలలో సౌకర్యాలు కల్పించాలి

Mar 28,2024 22:45
పిఆర్‌ డిగ్రీ కళాశాలలో

ప్రజాశక్తి – కాకినాడ

పిఆర్‌ డిగ్రీ కళాశాలలో సౌకర్యాలు కల్పించాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్‌ చేశారు. గురువారం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం.గంగాసూరిబాబు, నగర కార్యదర్శి వాసు కళాశాల ప్రిన్సిపల్‌ బి.తిరుపాణ్యంకి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 3 వేల మంది విద్యార్థినీ, విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్న కళశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అన్నారు. కళాశాలలో పూర్తిస్థాయిలో పర్మినెంట్‌ అధ్యాపకుల్ని నియమించాలని, ఖాళీగా ఉన్న అధ్యాపక, అధ్యాపకేతర పోస్టులు భర్తీ చేయాలని, అన్ని డిపార్ట్మెంట్లకు అదనపు తరగతి గదులు నిర్మించాలని డిమాండ్‌ చేశారు. ప్రిన్సిపల్‌ను కలిసిన వారిలో ఎస్‌ఎఫ్‌ఐ నగర అధ్యక్షులు సంజరు, నగర ఉపాధ్యక్షులు అభిషేక్‌ పాల్గొన్నారు.

➡️