దాతల సహకారంతో నిర్మించిన గ్రంథాలయం
ప్రజాశక్తి-మండపేట
స్థానిక మారేడుబాక రోడ్డులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో నేడు గ్రంథాలయం ప్రారంభం కానుంది. విద్యార్థుల సౌకర్యార్థం ప్రముఖ విద్యాదాత పారిశ్రామికవేత్త మాధవీ ఎడిబుల్ అయిల్స్ అధినేత వేగుళ్ళ చైతన్యబాబు సుమారు రూ.30 లక్షల సొంత నిధులతో నిర్మించిన వేగుళ్ళ సూర్యారావు నూతన గ్రంథాలయం భవనాన్ని బుధవారం ప్రారంభిస్తున్నామని ప్రిన్సిపల్ డాక్టర్ టికెవి.శ్రీనివాసరావు తెలిపారు.