సమావేశంలో మాట్లాడుతున్న రాజబాబు తదితరులు
ప్రజాశక్తి-మండపేట
ప్రొటోకాల్పై మాట్లా డే అర్హత ఎంఎల్ఎ వేగుళ్ల జోగేశ్వరరావుకు లేదని వైసిపి రాష్ట్ర నాయకులు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు రెడ్డి రాజబాబు అన్నారు. శనివారం స్థానిక వైసిపి కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంఎల్సి తోట త్రిమూర్తులు, వైసిపి నాయకులు కర్రి పాపారాయుడు, ఏడిద సర్పంచ్ బూరిగ ఆశీర్వాదంతో కలిసి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అనేక సందర్భాల్లో గెలిచిన వారిని పక్కన పెట్టి ఓడిపోయిన వారికి పెత్తనమిచ్చిన సంఘటనలు కోకొల్లలు ఉన్నాయన్నారు. గత కౌన్సిల్ సమావేశాల్లో అప్పటి కౌన్సిలర్ వరలక్ష్మి తన వార్డు సమస్యలపై అడిగితే చైర్మన్ సమాధానం చెప్పాల్సి వుండగా ఎంఎల్ఎ తమవారి వార్డు పనులు అన్నీ పనులు పూర్తి చేసాకే మీ వార్డు పనులు చేస్తామన్న చెప్పిన సంగతిని గుర్తుచేశారు. అంతే కాకుండా రేపు టిడ్కో ఇళ్లు పంపిణీ చేస్తామనగా ముందు రోజు ధర్నా చేయడం సబబేనా అని ప్రశ్నించారు. టిడ్కో ఇళ్ల దగ్గర ప్రొటోకాల్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులకే ఎంఎల్ఎ అధ్యక్షత వుంటుందన్నారు. మున్సిపల్ నిధులతో చేసిన పనులకు చైర్పర్సన్ అధ్యక్షతన జరుగుతుందన్నారు. ఈ విషయంలో ప్రొటోకాల్ ఉల్లంఘన జరగలేదన్నారు. అనంతరం తోట, పాపారాయుడులు మాట్లాడుతూ. గత ప్రభుత్వ హయాంలో ఎన్ని రూ.కోట్లతో విద్యుత్ పనులు చేపట్టారో ఎంఎల్ఎ చెప్పాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిల్ విప్ పోతంశెట్టి ప్రసాద్, ఎంపిపి ఉండమట్ల వాసు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.